by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:54 PM
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రీతమును శుక్రవారం భిక్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ అధ్యక్షులు దశరథం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పెద్ద ఎత్తున పలు వాహనాలలో హైదరాబాదుకు తరలి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పుష్పగుచ్చాలు అందజేశారు.