by Suryaa Desk | Sun, Jul 14, 2024, 10:47 AM
శాతవాహన యూనివర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.