![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 04:06 PM
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు రాము పంతులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి మాజీ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి, కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి, కుటుంబ సమేతంగా,శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ వైస్ ఛైర్మెన్ రాజ్ మోహన్ రెడ్డి, శ్రీ సీతారాముల స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఆశీనులై స్వామి వారికీ అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు అందించి ప్రత్యేక పూజలు పాల్గొని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఎన్నో కష్టాలు త్యాగాలు కోర్చిన శ్రీ సీతారాముల పవిత్ర బంధం ఆజరామరమైనదని, సత్య ధర్మ పాలనకు, నేటి భావి తరాలకు ఆదర్శనీయుడని, శ్రీ సీతారాముల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను వేడుకున్నానని తెలిపారు. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ ,బొర్రా దేవి చందు ముదిరాజ్, మేకల వెంకటేష్,మాజీ కో-ఆప్షన్ సభ్యలు తల్లారి వీరేష్, గ్రామ పెద్దలు లీడర్ నర్సింహా రెడ్డి గారి దంపతులు, ప్రమీల సాయిలు యాదవ్ & కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి గారి దంపతులు,కోలన్ గోపాల్ రెడ్డి,సరెందర్ రెడ్డి, రుక్కా రెడ్డి, నగేష్ చారీ, జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు బొర్రా చందు,శ్రీకాంత్ రెడ్డి, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు బైండ్ల నగేష్, నాగరాజ్ యాదవ్, టేకుల సుధాకర్ రెడ్డి, కోలన్ లక్ష్మణ్ రెడ్డి, ప్రవీణ్, తల్లారి సాయి, ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మరియు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.