![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 03:32 PM
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.