|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:51 PM
పాల్వంచ మండల పరిధి పేట గ్రామంలో సోమవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వం ఎల్లవేళలా రైతుల కోసం.
రైతుల గురించి చర్యలు తీసుకుంటారని ఈ యొక్క అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఎల్లవేళలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్లు అతి త్వరలో రైస్ మిల్లులకు చేరేలా చర్యలు చేపడతామన్నారు.