|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 07:29 PM
ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం నాటి ధరలతో పోల్చితే పసిడి ధర తగ్గడంతో కొనుగోలుదారులకు కొంతమేర ఉపశమనం లభించింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే రూ.350 తగ్గి రూ.87,200 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.95,180 గా నమోదైంది. చెన్నై మార్కెట్లో కూడా ఇవే ధరలు కొనసాగాయి.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 తగ్గి రూ.87,350 కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.95,330 వద్ద ట్రేడ్ అయింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇటీవలి కాలంలో ఒడిదుడుకులకు లోనవుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.మరోవైపు, వెండి ధరల్లోనూ మంగళవారం తగ్గుదల కనిపించింది. సోమవారం ముగింపు ధరతో పోలిస్తే, కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,800 గా నమోదైంది.