|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 09:08 PM
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యో మెట్రోను సందర్శించారు. టోక్యో మెట్రోను తొమ్మిది లైన్లతో అత్యాధునికంగా నిర్మించారు. దాని కార్యాచరణ, సాంకేతిక వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. ప్రయాణికులకు అందిస్తున్న అత్యంత సౌకర్యవంతమైన సేవలను పరిశీలించింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాదులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు.ఆ తర్వాత జపాన్ కంపెనీ మారుబెనీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఇందులో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మారుబెనీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులు సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొదటి ప్రాజెక్టు ఇదేనని, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు.