|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:02 PM
మహబూబ్ నగర్ దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించారు. రూ.2.5 కోట్లకు డీల్ కుదిరినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది.
కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచరించినట్లు గుర్తించిన ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు.