|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:24 PM
భూ భారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడతాయని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న.
అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, కేతేపల్లి తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలన్నభూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.