|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:28 PM
కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో సైతం పోరాటం చేసిందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ.. అది జాతీయ స్థాయి ఆలోచనలతోనే పని చేస్తుందన్నారు. పార్టీ సిద్ధాంత ప్రచారం.
సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పని చేయాలని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మకమన్నారు.