|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 01:00 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 13, 500 జెండా పాట పలుకగా, క్వింటాల్ పత్తి ధర రూ. 7, 650 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.
నిన్నటితో పోల్చితే పత్తి ధర మాత్రం రూ. 350 పెరగగా, మిర్చి ధర రూ. 175 తగ్గినట్లు వ్యాపారులు చెప్పారు. మార్కెట్లో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.