|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 12:55 PM
జమ్మూకశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సత్తుపల్లిలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యాన చేపట్టిన ఈ ర్యాలీ ఎమ్మెల్యే నివాసం నుంచి బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగ్రదాడికి కేంద్రమే బాధ్యత వహించాలి. కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఇంటలిజెన్స్ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.