|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 04:20 PM
TG: రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎండ ప్రభావం అధికంగా ఉంది. రేపు రాష్ట్రంలో పలుజిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.