|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:36 PM
తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం ఉదయం మెదక్ లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ లో 35 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.