|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 07:59 PM
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అధికారిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్పై కేసు నమోదైంది. నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సెక్షన్ అధికారి తన విధి నిర్వహణలో ఉండగా, కార్పొరేటర్ ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం బీఎన్ఎస్ సెక్షన్ 132, దాడికి పాల్పడటం బీఎన్ఎస్ సెక్షన్ 352 వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సంఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్పై కేసు నమోదు చేసిన విషయాన్ని అబిడ్స్ పోలీసులు జీహెచ్ఎంసీ కమిషనర్కు తెలియజేశారు.