|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 09:26 PM
బీజేపీ పార్టీ కార్యకర్తలు ఇకపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో బీజేపీపై ఇతర పార్టీలు ఎవరు పోస్టులు పెట్టినా ప్రతి కార్యకర్త కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నకిలీ ఖాతాలతో బీజేపీ మీద పోస్టులు పెడుతున్నాయని ఆయన అన్నారు. తమపై తప్పుడు వార్త రాసిన పత్రికపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేశామని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదని ఆయన అన్నారు.