by Suryaa Desk | Fri, Jul 12, 2024, 08:13 PM
డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట దూకుడు కొనసాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే.. రంగంలోకి దిగి అధికారులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో.. పారిశుద్ధ్య నిర్వాహణపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమ్రపాలి.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మల్కాజిగిరిలోని సఫిల్గూడ లేక్ పార్కును మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి పరిశీలించారు. వాకర్లతో మాట్లాడి వారి సమస్యలను వివరించారు. ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.