by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:35 PM
కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ మల్లిక గార్డెన్స్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.