![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 07:01 PM
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అదివారం మాగనూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మేళ వాయిద్యాలతో ముందుగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జెండాను ఎగుర వేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు.