![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 09:11 PM
మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.టూరిజం సెక్రటరీ స్మితా సభర్వాల్ అధికారులకు దిశానిర్దేశం. స్వాగత ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారు. వారు మే 6, 7న హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో ప్యాలెస్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని స్మితా సభర్వాల్ అధికారులకు సూచించారు. 120 మంది మోడల్స్ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారు.ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.