![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 04:18 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,310.11 పాయింట్లు పెరిగి 75,157.26 వద్ద, నిఫ్టీ 429.40 పాయింట్లు లాభపడి 22,828.55 వద్ద ముగిశాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, JSW స్టీల్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభపడగా, TCS, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.05 వద్ద ముగిసింది.