|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 12:29 PM
హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. హోటల్లోని మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. ప్రస్తుతం పార్క్ హయత్ హోటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తినష్టం జరిగినట్లుగా తెలిపారు.