|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 11:16 AM
అఘోరీ శ్రీనివాస్పై తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. తాజాగా అఘోరీపై సాధువులు ఫైర్ అయ్యారు. వర్షిణి జీవితాన్ని నాశనం చేసిన అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షిణిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. నాగసాధు అఘోరీ అని చెప్పుకుంటూ ఘోరాలు చేస్తున్న శ్రీనివాస్ను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ బండారం బయటపడింది. శ్రీ వర్షిణికి మాయ మాటలు చెప్పి… లేడీ అఘోరి దారుణానికి వొడిగట్టింది. ఏపీకి చెందిన శ్రీ వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంది లేడీ అఘోరి. హిందూ సాంప్రదాయం ప్రకారం… శ్రీ వర్షిని మెడలో తాళి కూడా కట్టింది. గుజరాత్ లోని ఓ ప్రముఖ గుడి ప్రాంగణం లోనే వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.