|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 02:11 PM
తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీచేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.