|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:28 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఉట్కూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద మంగళవారం రైతులకు వరి, కంది విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాలు నాటి అధిక దిగుబడులు పొందాలని చెప్పారు. పంటల సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలని, పంట యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు