|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:04 PM
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నాయకులకు ఏమాత్రం లేదని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా, అనవసర విమర్శలు చేస్తే తెలంగాణ గడ్డపై బీజేపీ నేతలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. "మీరు తప్పులు చేస్తూ, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకుడిపై నిందలు వేయడం ఎంతటి దుర్మార్గమైన ఆలోచనో, ఎంత నీచమైన సంస్కృతో ప్రజలు గమనిస్తున్నారు" అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవడం కోసం బీజేపీ వాడుకుంటోందని దుయ్యబట్టారు.