|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 12:34 PM
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. వారిరువురినీ రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా సర్కార్ను ఏర్పాటు చేస్తుందని రాసుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి రేపు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన దేనిపై తొలి సంతకం చేయనున్నారని ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాల అమలుకు దాదాపు రూ.88 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా. సీఎం హోదాలో రేవంత్ ఏ వర్గానికి శుభవార్త చెప్పనున్నారో? రేపటి వరకు వేచి చూడాలి.
తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. తొలుత ఆయన గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇటీవల ఆ సమయం కాస్త పెరిగింది. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరానున్నారు.