![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 07:46 PM
TG: శంషాబాద్ పీఎస్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఆనంద్ చారి అనే వ్యక్తి బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ అనుమానం వచ్చి భర్త టీ షర్ట్ పై పడిన పసుపు రంగు చూసి బాత్రూంలోకి వెళ్లి చూడగా యాసిడ్ డబ్బా సగమే ఉండటంతో యాసిడ్ తాగినట్లు గుర్తించింది. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తుండగా.. ఆనంద్ చారి మృతి చెందాడు.