![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 12:13 PM
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. యాసంగిలో మొక్కజొన్న సాగు చేయగా వంట చేతికి రావడంతో విక్రయించేందుకు కళ్లాల్లో ఆరబెట్టారు. ఆకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. మిర్చి పంట చివరి దశకు చేరుకోగా విక్రయించేందుకు కల్లాల వద్ద అరబెట్టగా వర్షం కారణంగా తడిచింది. దీంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.