![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 02:00 PM
నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ లో రిమ్మనగూడ గ్రామానికి చెందిన శివలింగం గౌడ్ కు సీఎం రిలీఫ్ ఫండ్ 28000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యమని, నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.