|
|
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:14 AM
భద్రాచలంలో గుండెపోటుతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతను స్థానిక ఎమ్మెల్యే, డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి రక్షించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటన సందర్భంగా పార్టీకి చెందిన నేతలంతా భద్రాచలానికి వచ్చారు. ఈ సమయంలో ఒక కాంగ్రెస్ నేత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే స్పందించి సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కాంగ్రెస్ నేతను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.