![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:14 PM
హైదరాబాద్ లోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఎల్లుండి వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల ప్రకారం 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. వైన్ షాపులు, బార్లతో పాటు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.