|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:29 PM
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో అందిస్తున్న 'ఎం-క్యాష్' (m-Cash) సర్వీసును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ తర్వాత ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్లలో ప్రస్తుతం ఈ ఎం-క్యాష్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా కస్టమర్లు లబ్ధిదారుడి (బెనిఫిషియరీ) బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేయకుండానే, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ ఉపయోగించి డబ్బు పంపడం, స్వీకరించడం చేయవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని ఈ నెల 30 నుంచి తొలగించనున్నట్లు బ్యాంకు తెలిపింది.ఎం-క్యాష్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో కస్టమర్లు నగదు బదిలీ కోసం ఇతర సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకోవాలని ఎస్బీఐ సూచించింది. ప్రత్యామ్నాయ మార్గాలుగా యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS) వంటివి అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.