![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:15 PM
ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 930.67 పాయింట్లు నష్టపోయి 75,364.69 వద్ద, నిఫ్టీ 345.65 పాయింట్లు క్షీణించి 22,904.45 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్, HDFC, అపోలో హాస్పిటల్స్ లాభపడగా, టాటా స్టీల్, హిందాల్కో, ONGC, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.23 వద్ద ఉంది.