|
|
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 03:01 PM
కోడలిని రక్షించేందుకు అత్త బావిలోకి దూకిన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. పాలంబుండి గ్రామానికి చెందిన సరసు (22) ఆవులను మేతకు తీసుకెళ్లి ప్రమాదవశాత్తు 60 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది.
గమనించిన అత్త, కోడలిని రక్షించేందుకు బావిలో దూకేసింది. ఇద్దరు ఓ రాయిని పట్టుకొని కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తాడు సాయంతో వారిని రక్షించారు.