|
|
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 03:04 PM
BRS కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసూదనాచారి సహా పలువురు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
జగ్జీవన్ రామ్కు భారత రత్న ఇవ్వాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు విరుద్ధంగా పని చేస్తున్నదన్నారు.