|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 08:17 PM
సింగరేణి ఆద్వర్యంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీలో సీఎండీ ఎన్. బలరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా 121 మొక్కలను నాటారు. ప్రతీ ఒక్కరు కూడా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు.