|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 01:22 PM
బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్ జీహెచ్ఎంసి కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలను ఎప్పటికీ ప్రజలు మరిచిపోరని అన్నారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మనోహర్రెడ్డి, కొప్పు భాషా, భాజపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇక, రాజాసింగ్ మాట్లాడుతూ.. 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని మా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.