by Suryaa Desk | Sun, Jul 14, 2024, 03:10 PM
సీఏ ఇంటర్ లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన ఎస్ఆర్ నగర్ లోని లక్ష్య కళాశాల విద్యార్థి తరుణ్ కుమార్ రెడ్డి ని కళాశాల ప్రతినిధులు శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ మురళి వైట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృషి, పట్టుదల క్రమశిక్షణ విజయానికి మార్గం సుగమం చేస్తాయనడానికి విద్యార్థి తరుణ్ నిదర్శనమని పేర్కొన్నారు.