![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 10:52 AM
ఎయిర్ ఏషియా విమానం ఒకటి గత అర్ధరాత్రి అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే శంషాబాద్ ఏటీసీకి సమాచారం అందించాడు.ఎమర్జెన్సీ ల్యాండింగ్కు వారు అనుమతినివ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులున్నారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.