![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 09:55 AM
లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రాయితీ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ రాయితీ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.ఎల్ఆర్ఎస్ రుసుమును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి 31వ తేదీ వరకు మొదట గడువు ఇచ్చింది. తాజాగా ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి స్పందన ప్రభుత్వం అనుకున్నంతగా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.