![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:48 AM
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును లోక్సభ ఆమోదించింది. బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు.మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. ఇక ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు.కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.