|
|
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:08 PM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని.. ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని బంజారా హిల్స్ పార్క్ హయత్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని.. రాష్ట్రంలోని టైర్ 2, 3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.