|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 03:09 PM
దేవరకద్ర మండల గూరకొండలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించారు. గ్రామంలో అర్హులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలతో కలిసి స్పెషల్ ఆఫీసర్ బలరాం సార్ సెక్రెటరీ రాఘవేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఓరుగంటి హన్మంతు, మేస్త్రి గడుగు చిన్న కృష్ణయ్య, దాసరి శ్రీను, గౌని నారాయణమ్మ, దాసరి పంతులు ఉషానప్ప, అధ్యక్షులు గడుగు కృష్ణయ్య పాల్గొన్నారు.