|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 11:35 AM
సంగారెడ్డి మున్సిపాలిటీ 23వ వార్డు పరిధిలోని శివాజీ నగర్ లో విద్యుత్ శాఖ అధికారులు గురువారం కాలనీ బాట నిర్వహించారు. సినిమా రోడ్డులోని ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.