by Suryaa Desk | Sun, Jul 14, 2024, 03:56 PM
కుటుంబ సమేతంగా ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ యం. వెంకటేశ్వరరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకొని సేవలో తరించారు. నాగిరెడ్డి మండపంలో చైర్మన్ దంపతులకు ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు.