![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:28 PM
బాన్సువాడ పట్టణంలోని తాడుకోలు చౌరస్తాలో నాగులగామ గిర్మయ్య జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు నాగులగామ వెంకన్న గుప్తా ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల కోసం అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.