|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:58 PM
ఉట్కూర్ మండలంలో గడిచిన 18 నెలల కాలంలో బాధితులకు రూ. 90 లక్షల సీఎం సహాయ నిధి డబ్బులు అందించామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఉట్కూర్ ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్, బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. గత ప్రభుత్వ హయాంలో 9 నెలలకు ఒకసారి అందించేవారని, ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి కల్యాణలక్ష్మి చెక్కులు అందిస్తున్నామన్నారు.