|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:18 PM
కేరళలో ఓ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చిన్ను పప్పుగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల కె. రేష్మ, కాసరగోడ్ జిల్లాలోని తన అద్దె ఇంట్లో విగతజీవిగా కనిపించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.కాసరగోడ్ సమీపంలోని ఉలియతడ్క ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూసింది. రేష్మ తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సోషల్ మీడియాలో 'చిన్ను పప్పు' పేరుతో రేష్మకు మంచి గుర్తింపు ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సుమారు నెల రోజుల క్రితమే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నెలకొన్న మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని, కుట్ర కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని తెలిపారు.
Latest News