by Suryaa Desk | Thu, Sep 05, 2024, 04:15 PM
పాల బిల్లులు చెల్లించాలని కల్వకుర్తి పాడి రైతులు మార్చాల గ్రామంలోని నేషనల్ హైవే పై గురువారం ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం గత రెండు నెలలుగా పాలబిల్లులు చెల్లించక పోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్డు పై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారుశారు. ఈ కార్యక్రమంలో రైతులు బాలయ్య, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.